చంద్రబాబు, పవన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2020-08-15T10:33:06+05:30 IST
‘‘ఎందరో దేశభక్తుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకి మూలధనం. వాళ్లందరినీ స్మరించుకుని ..
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి):‘‘ఎందరో దేశభక్తుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకి మూలధనం. వాళ్లందరినీ స్మరించుకుని నివాళులర్పించే శుభ సందర్భమిది’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. దేశప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం ఒక అనిర్వచనీయమైన ఉత్తేజం కలిగించే వేడుక అంటూ పవన్కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.