ఉద్యోగుల మద్దతు ప్రభుత్వానికే..: చంద్రశేఖర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-17T15:23:23+05:30 IST

ద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సీఎం జగన్ భరోసా ఇచ్చారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉద్యోగుల మద్దతు ప్రభుత్వానికే..: చంద్రశేఖర్‌రెడ్డి

తిరుమల: ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సీఎం జగన్ భరోసా ఇచ్చారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాను పారద్రోలేందుకు ఏపీ ప్రభుత్వం చాలా కృషి చేసిందని చెప్పారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు ఇంటి వద్దకే చేరుతున్నాయన్నారు. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు, ఉద్యోగుల సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. 

Updated Date - 2021-01-17T15:23:23+05:30 IST