కీలక మ్యాచ్లో టాస్ ఓడిన కోల్కతా
ABN , First Publish Date - 2020-10-30T00:42:07+05:30 IST
ఐపీఎల్లో నేడు మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. కోల్కతాతో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 49వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్
దుబాయ్: ఐపీఎల్లో నేడు మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. కోల్కతాతో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 49వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ ఆశలను ఇప్పటికే దూరం చేసుకున్న చెన్నైకి ఇది నామమాత్రపు మ్యాచ్ కాగా, ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న కోల్కతాకు మాత్రం ఇది చావో రేవో. ఈ మ్యాచ్లో కనుక గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడితే కనుక సమీకరణాలు ఆసక్తికరంగా మారతాయి.
చెన్నై జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. డుప్లెసిస్, తాహిర్, మోనులు బెంచ్కు పరిమితం కాగా, వాట్సన్, లుంగి ఎంగిడి, కర్న్ శర్మ జట్టులోకి వచ్చారు. కోల్కతా జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. ప్రసీధ్ కృష్ణ స్థానంలో రింకు సింగ్ జట్టులోకి వచ్చాడు.