ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి జగన్
ABN , First Publish Date - 2022-04-30T08:47:36+05:30 IST
ఢిల్లీ చేరిన ముఖ్యమంత్రి జగన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఇక్కడ సివిల్ సర్వీస్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న పలువురు రాష్ట్ర విద్యార్థులు విమానాశ్రయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా శనివారం విజ్ఞాన్ భవన్లో జరిగే ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఆయన పాల్గొంటారు.