చిక్కడపల్లి హత్యకేసులో ఇంకా వీడని మిస్టరీ?

ABN , First Publish Date - 2021-04-06T12:20:39+05:30 IST

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సద్నామ్‌సింగ్‌ హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు.

చిక్కడపల్లి హత్యకేసులో ఇంకా వీడని మిస్టరీ?

హైదరాబాద్/చిక్కడపల్లి : చిక్కడపల్లి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలోని సూర్యానగర్‌లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సద్నామ్‌సింగ్‌ హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈనెల 1న తెల్లవారుఝామున ఈ హత్య జరగగా, 5రోజులైనా హత్య కేసు చిక్కుముడి వీడలేదు. ఈ కేసులో రెండు ప్రత్యేకబృందాలు హతుడి సొంత రాష్ట్రమైన పంజాబ్‌తోపాటు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.


సద్నామ్‌సింగ్‌ అన్నకొడుకు నిషాంత్‌సింగ్‌ జాడ తెలియకపోవడంతో పోలీసులు అతనికోసం విస్తృతంగా గాలిస్తున్నారు. నిందితుని ఫోన్‌ లొకేషన్‌ టాప్‌ చేయడానికి కూడా యత్నిస్తున్నారు. ఒక్కసారి అతను దొరికితే హత్య చిక్కుముడి అంతా విడిపోతుందని సీఐ శివశంకరరావు పేర్కొంటున్నారు. ఘటన స్థలంలో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే హత్య జరిగిన రోజు నిషాంత్‌సింగ్‌ హత్య జరిగిన ఇంటినుంచి బయటకు వెళ్లినట్లు కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు. నిషాంత్‌సింగ్‌ దొరికితే హత్యకు గల కారణాలు వస్తాయంటున్నారు. 

Updated Date - 2021-04-06T12:20:39+05:30 IST