చంద్రబాబుకు చైనా రాయబారి లేఖ
ABN , First Publish Date - 2022-01-19T20:50:42+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు. కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. వారిద్దరూ హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య చికిత్సను తీసుకుంటున్నారు. తొలుత నారా లోకేష్కు కరోనా వైరస్ సోకింది. మంగళవారం చంద్రబాబుకు కోవిడ్ పాజిటీవ్ వచ్చినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయం విధితమే