టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి: చిన్నారెడ్డి

ABN , First Publish Date - 2021-02-12T21:11:18+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి: చిన్నారెడ్డి

హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  సాగర్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ హాలియాలో వరాలు కురిపించారని చిన్నారెడ్డి తెలిపారు. ఉద్యోగులు, యువత నిరాశలో ఉన్నారని చెప్పారు. నిరుద్యోగ భృతి, పీఆర్సీ ఏమైందని చిన్నారెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ విఫలమైందని చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తు ఊరుకోమని టీఆర్ఎస్ నేతలను చిన్నారెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2021-02-12T21:11:18+05:30 IST