పెళ్లి కొడుకు ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన ప్రియురాలు

ABN , First Publish Date - 2020-11-20T16:26:54+05:30 IST

పెళ్లి కొడుకు గణేష్ ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది.

పెళ్లి కొడుకు ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన ప్రియురాలు

చిత్తూరు జిల్లా: గంగవరం మండలం, కలగటూరులో పెళ్లి కొడుకు గణేష్ ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. పెద్ద పంజాణి మండలం, కెలవాతి గ్రామానికి చెందిన యువతి గణేష్ తనను ప్రేమించి వేరొక యువతిని పెళ్లి చేసుకున్నాడని, తనను మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ప్రియుడి ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగింది. ఆ యువతి చర్యను గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారు. దీంతో ఆ యువతి వారిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-11-20T16:26:54+05:30 IST