ఇదే నా చివరి మ్యాచ్ అవుతుందేమో: క్రిస్ లిన్

ABN , First Publish Date - 2021-04-10T21:40:01+05:30 IST

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తానాడిన తొలి మ్యాచే తనకు చివరి మ్యాచ్ అవుతుందేమోనని ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రిస్ లిన్ అనుమానం వ్యక్తం చేశాడు.

ఇదే నా చివరి మ్యాచ్ అవుతుందేమో: క్రిస్ లిన్

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తానాడిన తొలి మ్యాచే తనకు చివరి మ్యాచ్ అవుతుందేమోనని ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రిస్ లిన్ అనుమానం వ్యక్తం చేశాడు. గత సీజన్‌లో జట్టుతో పాటే ఉన్నా క్రిస్ లిన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ సీజన్‌లో మాత్రం ఆరంభ మ్యాచ్‌లోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 35 బంతుల్లో 49 పరుగులతో రాణించాడు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్‌కు కారణమయ్యాడు. 


మ్యాచ్ అనంతరం మాట్లాడిన క్రిస్ లిన్.. రోహిత్ రనౌట్ గురించి స్పందించాడు. `రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడికి గురయ్యా. ఆ బాల్‌కు పరుగు వస్తుందనుకున్నా. కానీ, దురదృష్టవశాత్తూ రోహిత్ రనౌట్ అయిపోయాడు. ఏ మాత్రం అవకాశం ఉన్నా కెప్టెన్ కోసం నేను ఆనందంగా వికెట్ సమర్పించుకునేవాడిని. రోహిత్ క్రీజులో ఉండుంటే భారీ స్కోరు చేసుండేవాడేమో. మ్యాచ్ ఫలితం కూడా వేరేలా ఉండేది కావొచ్చు. ఏమో, ఈ మొదటి మ్యాచే ఈ సీజన్‌లో నా చివరి మ్యాచ్ కావొచ్చ`ని క్రిస్ అన్నాడు. 

Updated Date - 2021-04-10T21:40:01+05:30 IST