CI కుటుంబానికి రూ. 25 లక్షల సాయం

ABN , First Publish Date - 2022-09-16T12:07:41+05:30 IST

గుండె పోటుతో మృతిచెందిన ఓ సీఐ కుటుంబానికి ఆయన బ్యాచ్‌కు చెందిన సీఐలు, డీఎస్పీలు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు...

CI కుటుంబానికి రూ. 25 లక్షల సాయం

Tirupati: గుండె పోటుతో మృతిచెందిన ఓ సీఐ కుటుంబానికి(CI Family) ఆయన బ్యాచ్‌కు చెందిన సీఐలు, డీఎస్పీలు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని(Financial assistance) అందించారు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం చిన్నబీరవెల్లికి చెందిన వై. రమే‌ష్‎బాబు 1996 బ్యాచ్‌లో ఎస్‌ఐగా ఎపింకయ్యారు. కుటుంబంతో హైదరాబాద్‌ ఉప్పల్‌లో స్థిరపడ్డారు. గత ఏడాదినుంచి ఆదిలాబాద్‌ జిల్లా, ఇచ్చోడ పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన కొంతకాలంగా జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజులక్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో ఉండగానే గుండెపోటుకు గురైన ఆయన మంగళవారం మృతిచెందారు.ఉప్పల్‌లో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాల్లో సీఐలు, డీఎస్పీలుగా పనిచేస్తున్న రమే‌ష్‎బాబు బ్యాచ్‌కు చెందిన పోలీసు అధికారులు రూ. 25,00,116 చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేసి ఏ అవసరం వచ్చినా తామున్నామంటూ ధైర్యం చెప్పారు. 

Updated Date - 2022-09-16T12:07:41+05:30 IST