నేడు తిరుమలకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ABN , First Publish Date - 2021-06-10T13:40:31+05:30 IST
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం తిరుమలకు వస్తున్నారు. రాత్రి తిరుమలలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ బస చేయనున్నారు. రేపు శుక్రవారం శ్రీవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకుంటారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.