పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయండి : కలెక్టర్
ABN , First Publish Date - 2021-09-19T05:11:54+05:30 IST
పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయండి : కలెక్టర్
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి): మేడ్చల్ జిల్లా పరిధిలో పెండింగ్లో ఉన్న ఎన్నికల ఓట్ల సవరణ, కొత్త ఓటర్ల దరఖాస్తులను వారంలో పరిష్కరించాలని ఇన్చార్జి కలెక్టర్ హరీష్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలను తప్పులు లేకుండా ముద్రించడంతోపాటు 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు ఇవ్వడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక గోయల్ శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మేడ్చల్ జిల్లాలో పెండింగ్లో ఉన్న 25వేల దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ అధికారులకు సూచించారు. 2022లో ఎన్నికల తుది జాబితాను నిర్ణయించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో తప్పులు, ఇతర సవరణలను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో డీఆర్డీవో లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.