పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఎడారే: భట్టి

ABN , First Publish Date - 2020-08-10T00:08:10+05:30 IST

ఏపీ ప్రభుత్వం కట్టే ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణ ఎడారి కాబోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ భేటీ అనంతరం భట్టి

పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఎడారే: భట్టి

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం కట్టే ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణ ఎడారి కాబోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత అవసరాల కోసం కేసీఆర్... తెలంగాణ తాకట్టుపెడుతున్నారు. కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి సమస్యను వివరిస్తామన్నారు. ఢిల్లీకి కాంగ్రెస్ ప్రతినిధి బృందం వెళ్లనుందని తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులు.. హత్యలపై సోషల్ జస్టిస్ శాఖ మంత్రిని కలుస్తామన్నారు. అలాగే రాష్ట్రపతికి, ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేలనే కాదు... కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా టీఆర్ఎస్ ఆక్రమిస్తుందని మండిపడ్డారు. బెల్ట్ షాపులను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బెల్ట్ షాపులపై ఉద్యమం చేస్తామని ప్రకటించారు. కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక్కటైన ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యానికి సంబందించిన రేటుని ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను సీఎల్పీ ఆధ్వర్యంలో సందర్శించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-08-10T00:08:10+05:30 IST