ఎమ్మెల్సీ కరీమున్నీసా మరణం పట్ల సీఎం Jagan దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-11-20T14:36:20+05:30 IST

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ కరీమున్నీసా మరణం పట్ల సీఎం Jagan దిగ్భ్రాంతి

అమరావతి: వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న ఉదయం శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురి కావడం, గుండె పోటుతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2021-11-20T14:36:20+05:30 IST