ఒడిశా సీఎంతో మంగళవారం సీఎం జగన్‌ భేటీ

ABN , First Publish Date - 2021-11-08T22:42:16+05:30 IST

ఒడిశా సీఎం నవీన్ పట్నాయ‌తో సీఎం జగన్‌

ఒడిశా సీఎంతో మంగళవారం సీఎం జగన్‌ భేటీ

అమరావతి: ఒడిశా సీఎం నవీన్ పట్నాయ‌క్‌తో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఉభయరాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వంశధారపై నేరడి దగ్గర బ్యారేజ్‌ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్ట్‌, కొఠియా గ్రామాల సమస్యపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా నుంచి 103 ఎకరాలు అవసరమని అధికారులు తెలిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో 6 వేల ఎకరాల భూమికి సాగునీరు వస్తుందని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-11-08T22:42:16+05:30 IST