డాక్టర్ లక్ష్మణమూర్తి మృతికి కేసీఆర్‌ సంతాపం

ABN , First Publish Date - 2021-01-16T20:59:14+05:30 IST

ప్రముఖ ప్రజా వైద్యుడు రమక లక్ష్మణమూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

డాక్టర్ లక్ష్మణమూర్తి మృతికి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ ప్రజా వైద్యుడు రమక లక్ష్మణమూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష్మణ మూర్తి ప్రజా వైద్యం కోసం తన జీవితాన్ని అర్పించి పీపుల్స్‌ డాక్టర్‌గా ప్రజల గుండెల్లో కొలువుదీరారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన సేవలు తరతరాలు గుర్తుచేసుకుంటాయని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2021-01-16T20:59:14+05:30 IST