పోడు భూములపై ఉన్నతాధికారులతో సీఎం సమావేశం
ABN , First Publish Date - 2021-10-10T00:37:15+05:30 IST
తెలంగాణలో పోడు భూములపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణలో పోడు భూములపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అటవీఅధికారులతో పాటు పలువురు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోడు భూముల విషయంలో ఇటీవల జరగిన పరిణామాలపై చర్చించారు. పోడు భూముల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.