సీఎం యోగికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-04-14T19:12:50+05:30 IST
సీఎం యోగి ఆదిత్యనాథ్కు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆయనకు
లక్నో : సీఎం యోగి ఆదిత్యనాథ్కు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆయనకు కరోనా అని తెలిసింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘‘ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో నేను కరోనా పరీక్షలు నిర్వహించుకున్నాను. పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నాను. చికిత్స తీసుకుంటున్నాను. వర్చువల్ రీతిలో విధులు మాత్రం నిర్వర్తిస్తూనే ఉన్నాను.’’ అని యోగి ట్వీట్ చేశారు.