కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

ABN , First Publish Date - 2020-10-20T01:04:41+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బ తిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను సీఎం పరిశీలించారు. భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను జగన్ పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని ఉన్నారు.


వెంటనే పరిహారం ఇవ్వండి..

సర్వే అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. వీలైనంత వేగంగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తే.. రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5రకాల నిత్యావసర సరుకులతో ప్రభుత్వం ఉచిత రేషన్‌ అందిస్తున్నదని సీఎంకు అధికారులు వివరించారు. మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని మంత్రులు, అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Updated Date - 2020-10-20T01:04:41+05:30 IST