ప్రతి గ్రామంలో కోల్డ్ స్టోరేజ్: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-04-01T14:34:32+05:30 IST

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రైతుల కోసం రూ.15 వేల కోట్లతో గోడౌన్‌, కోల్డ్ స్టోరేజ్ రూంలను

ప్రతి గ్రామంలో కోల్డ్ స్టోరేజ్: మంత్రి కన్నబాబు

తిరుమల: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రైతుల కోసం రూ.15 వేల కోట్లతో గోడౌన్‌, కోల్డ్ స్టోరేజ్ రూంలను నిర్మిస్తాంమని మంత్రి కన్నబాబు తెలిపారు. దీనిలో భాగంగా మొదటి దశలో 1500 కోట్లతో త్వరలోనే నిర్మాణాలను ప్రారంభిస్తామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. తమ పంటలను రైతులు అమ్ముకునేందుకు త్వరలోనే ఈ ప్లాట్ ఫాంలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 


అంతకుమందు ఆయన తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర, 2019 బ్యాచ్ ఐపీఎస్‌ అధికారులు కూడా  తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-04-01T14:34:32+05:30 IST