రూ.100 ఇస్తేనే పెన్షన్ ఆంధ్రజ్యోతి కథనాలపై కలెక్టర్ స్పందన
ABN , First Publish Date - 2022-01-08T01:39:19+05:30 IST
"రూ.100 ఇస్తేనే పెన్షన్" ఆంధ్రజ్యోతి కథనాలపై కలెక్టర్ స్పందన
విశాఖపట్నం: "రూ.100 ఇస్తేనే పెన్షన్"పై ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది. ఆంధ్రజ్యోతి కథనాలపై కలెక్టర్ మల్లికార్జున స్పందించారు. కోటవురట్ల మండలం చౌడువాడలో 9 మంది వాలంటీర్లపై వేటు వేశారు. పెన్షన్దారుల నుంచి రూ.100 వసూలు చేయాలంటూ ఆదేశాలిచ్చిన గ్రామ సర్పంచ్పై 3 నెలల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. విధుల పట్ల అలసత్వం వహించినందుకు వెల్ఫేర్ అండ్ ఎడ్యూకేషన్ అసిస్టెంట్ షేక్ సలీమాను సస్పెండ్ చేశారు. చౌడువాడ పంచాయతీ కార్యదర్శి పరమేశ్వరరావుకు అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. బాధితుల డబ్బులను తిరిగి చెల్లించామని కలెక్టర్ మల్లికార్జున చెప్పారు.