కాంటాక్ట్ ట్రేసింగ్, మ్యాపింగ్ వేగవంతం చేశాం: కలెక్టర్ శేషగిరిబాబు

ABN , First Publish Date - 2020-04-04T15:06:35+05:30 IST

నెల్లూరు: జిల్లాలో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు రికవరీ అయ్యారని కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు.

కాంటాక్ట్ ట్రేసింగ్, మ్యాపింగ్ వేగవంతం చేశాం: కలెక్టర్ శేషగిరిబాబు

నెల్లూరు: జిల్లాలో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు రికవరీ అయ్యారని కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. మిగిలిన వారికి పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తున్నామన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి క్లస్టర్ కంటెయిన్‌మెంట్ చర్యలను వేగవంతం చేశామన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్, మ్యాపింగ్ వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజల అత్యవసర వైద్యసేవల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. నగరంతోపాటు, పట్టణాలలోనూ ఆంక్షలు కట్టుదిట్టం చేశామని.. ప్రజలందరూ సహకరించాలని శేషగిరిబాబు కోరారు.

Updated Date - 2020-04-04T15:06:35+05:30 IST