కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: అజహరుద్దీన్
ABN , First Publish Date - 2021-09-13T22:25:49+05:30 IST
కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ అన్నారు. దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని కాంగ్రెస్ పార్టీ.....
కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ అన్నారు. దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అబివృద్ధి చెసిందని చెప్పారు. అభివృద్ధిని మరిచి టీఆర్ఎస్ పాలన కొనసాగిస్తుందని అజహరుద్దీన్ ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువస్తాని అజహరుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు