జేఈఈ అడ్వాన్స్డ్లో భాష్యం జయభేరి
ABN , First Publish Date - 2021-10-17T08:35:02+05:30 IST
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని ఆ సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ వెల్లడించారు.
గుంటూరు(విద్య), అక్టోబరు 16: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని ఆ సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ వెల్లడించారు. ఈ నెల 3న జరిగిన పరీక్షలో తమ విద్యార్థులు కె.సాయి లోకేశ్ జాతీయ స్థాయిలో 16వ ర్యాంకు, జి.ఆశిష్ సాయి 21, కె.సంపత్కుమార్ 24, ఎ.వినాయక్ ఖన్నా 40, ఎంవీ సనాతన్ శ్రీకర్ 41, ఎం.యశ్వంత్ 43, జి.సునీల్కుమార్ 73, పి.పోతురాజు 79, ఆర్.మురళి 83, టి. సుమంత్ 95, సీహెచ్ హేమంత్ కుమార్ 99వ ర్యాంకులతో అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపారు. 100లోపు 11 జాతీయ స్థాయి ర్యాంకులు, 200లోపు 20, 500లోపు 35, వెయ్యిలోపు 53, 2వేల లోపు 77, 5వేలలోపు 125 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారని వివరించారు. అంతేకాకుండా ఐఐటీ ఎంపికల్లో ఆల్ఇండియా ఆల్టైమ్ అత్యుత్తమ ఫలితాలతో నిలిచారని పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ భాష్యం హనుమంతరావు తదితరులు అభినందించారు.