కామన్‌ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2020-09-19T11:30:17+05:30 IST

తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో 2020-21 విద్యాసంవత్సరానికి గాను వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశం...

కామన్‌ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో 2020-21 విద్యాసంవత్సరానికి గాను వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్‌ పీజీసెట్‌ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. అక్టోబరు 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబరు 31 నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలు ఉంటాయని సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. కిషన్‌ తెలిపారు. పూర్తి వివరాలకు  http://tscpget.com/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Updated Date - 2020-09-19T11:30:17+05:30 IST