పాలమూరు నుంచే కాంగ్రెస్‌ పోరాటం: సంపత్‌

ABN , First Publish Date - 2021-10-11T00:31:17+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహించి, తెలంగాణ సాధించిన పాలమూరు గడ్డ మీది నుంచే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్‌

పాలమూరు నుంచే కాంగ్రెస్‌ పోరాటం: సంపత్‌

మహబూబ్‌నగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహించి, తెలంగాణ సాధించిన పాలమూరు గడ్డ మీది నుంచే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ మరో పోరాటం చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 12న నిరుద్యోగ సమర శంఖారావాన్ని పూరిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న ఈ సభకు రెండు లక్షల మంది తరలివస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్ల తరువాత కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రావడం దురదృష్టమకరమని సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-11T00:31:17+05:30 IST