మేం ఆరుగురం.. 110 మందికి గట్టి జవాబిస్తున్నాం: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2020-09-23T22:38:27+05:30 IST
మేం ఆరుగురం.. 110 మందికి గట్టి జవాబిస్తున్నాం: జగ్గారెడ్డి
హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ చార్జీలను ఇంకా తగ్గించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆయన సూచించారు. ఎల్ఆర్ఎస్ గడువు ఏడాది పొడిగించాలన్నారు. తలసాని గొప్పలు మాట్లాడి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని చెప్పారు. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూపిస్తానన్న తలసాని 15వేలు చూపలేకపోయారని పేర్కొన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు అభ్యర్థులు లేక తమ నేతలను చేర్చుకున్నారని గుర్తుచేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఎలా షాకిస్తారో తెలియదన్నారు. టీఆర్ఎస్కు డబ్బు బలం ఉంది..ఓటుకు రూ.10వేలు అయినా ఇస్తారని అన్నారు. టీఆర్ఎస్ దగ్గర డబ్బు తీసుకొని కాంగ్రెస్కు ఓటేయండన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు బయట కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. తాము ఆరుగురం.. 110 మందికి గట్టి జవాబిస్తున్నామని వ్యాఖ్యానించారు.