ఈ సంక్రాంతి ప్రతీ తెలుగు లోగిలిలో కొత్త వెలుగులు నింపాలి: Sailajanath
ABN , First Publish Date - 2022-01-14T14:42:20+05:30 IST
తెలుగు ప్రజలంతా బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ అన్నారు.
అమరావతి: తెలుగు ప్రజలంతా బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ అన్నారు. ఈ సంక్రాంతి ప్రతి తెలుగు లోగిలిలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఇది ప్రకృతితో అనుసంధానమైన రైతుల పండుగన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించి వారి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని అన్నారు. అందరూ కరోనా నిబంధనలను పాటించాలని శైలజానాథ్ సూచించారు.