16న కాంగ్రెస్ పీఏసీ మీటింగ్
ABN , First Publish Date - 2021-11-16T00:39:31+05:30 IST
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ జూమ్ యాప్ ద్వారా
హైదరాబాద్: కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ జూమ్ యాప్ ద్వారా సమావేశం అయింది. రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అంశంపై చర్చించారు. నల్గొండలో జిల్లాలో పోటీపై నాయకులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆ జిల్లా నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం మరో మారు బేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్లో పీఏసీ సమావేశం జరుగనుంది.