87 కరోనా కేసులు... ఆరుగురి మృతి
ABN , First Publish Date - 2021-05-17T05:39:26+05:30 IST
87 కరోనా కేసులు... ఆరుగురి మృతి
వరంగల్ రూరల్ కల్చరల్, మే 16: జిల్లాలో కరోనా కేసులు ఆదివారం కొద్దిగా తగ్గా యి. మొత్తం 349మందికి టెస్టులు నిర్వహించగా 87 కేసులు నమోదయ్యాయి. ఆరుగు రు కరోనాతో మృతి చెందారు. పీహెచ్సీల వారీగా కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. అలంకానిపేటలో 15, నర్సంపేటలో 13, సంగెం, గీసుగొండలో 12 చొప్పున, నడికూడలో ఎనిమిది, దామెర, చెన్నారావుపేటలో ఏడేసి చొప్పున, మేడపల్లిలో ఆరు, ఖానాపూర్లో ఐదు, నల్లబెల్లిలో రెండు కేసులు నమోదు కాగా ఆత్మకూరు, నర్సంపేటలో ఇద్దరు చొ ప్పున, పర్వతగిరి, కేశవాపూర్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వలేదు. ఆదివారం కొన్ని ఆరోగ్య కేంద్రాల పరి ధిలో టెస్టులు కూడా నిర్వహించలేదు.