ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి
ABN , First Publish Date - 2020-04-09T09:13:22+05:30 IST
ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి
అనంత వైద్యులకు వైరస్ సోకడంపై జూనియర్ వైద్యుల సంఘం ఆందోళన
విశాఖపట్నం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): అనంతపురం ఆస్పత్రిలో కొవిడ్ బాధితులకు వైద్యం అందిస్తున్న ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులకు వైరస్ సో కిందని, ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని వైద్య సిబ్బంది ర క్షణకు అవసరమైన సామగ్రి అం దించకపోతే ఈ తరహా కేసులు పెరి గే ప్రమాదముందని జూనియర్ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.దీ్పచంద్ అన్నారు. వైద్యులకు వైరస్ సోకిందన్న విషయం తెలిసిన తర్వాత దీప్చంద్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. కొవిడ్ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ వీడియోలో ప్రస్తావించారు. అనంతలో వైద్యులు కొద్దిరోజులుగా ఉన్నతాధికారులను రక్షణ సామగ్రి అడుగుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.