కరోనాతో పోరాడి ఓడిన హెచ్ఎం
ABN , First Publish Date - 2020-08-13T07:17:38+05:30 IST
కరోనాతో పోరాడి ఓడిన హెచ్ఎం
నెల్లూరు (వైద్యం)/మనుబోలు, ఆగస్టు 12: నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంకు కరోనా సోకింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతో జీజీహెచ్కు వచ్చారు. అక్కడ కూడా ఆయనను చేర్చుకోలేదు. తనకు రెండు కిడ్నీలు పాడయ్యాయని, కరోనాతో బాధపడుతుంటే జీజీహెచ్లో చేర్చుకోవడం లేదని రెండు చేతులు జోడించి వేడుకుం టూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన్ను జీజీహెచ్లో చేర్చుకుని చికిత్స అందించారు. వ్యవస్థపై పోరాడి ఆస్పత్రిలో చేరిన ఆయన కరోనాపై పోరాటంలో ఓడి మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.