తెలంగాణలో కొత్తగా 256 కరోనా పాజీటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-01-19T15:50:41+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రోజు కొత్తగా 256 కరోనా పాజీటివ్ కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రోజు కొత్తగా 256 కరోనా పాజీటివ్ కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో పాజీటివ్ కేసుల సంఖ్య 2,92,128కి చేరింది.సోమవారం ఇద్దరు కరోనా మృతి చెందడంతో..ఇప్పటి వరకు మొత్తం 1,581 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి.