కరోనా పేషెంట్‌పై అంబులెన్సులో అత్యాచారం.. డ్రైవర్ ఘాతుకం

ABN , First Publish Date - 2020-09-06T20:13:41+05:30 IST

కరోనా సోకి ఆస్పత్రికి వెళ్తున్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో అంబులెన్సు డ్రైవర్.

కరోనా పేషెంట్‌పై అంబులెన్సులో అత్యాచారం.. డ్రైవర్ ఘాతుకం

పాథన్‌మిట్ట: కరోనా సోకి ఆస్పత్రికి వెళ్తున్న ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో అంబులెన్సు డ్రైవర్. ఈ ఘటన కేరళలోని పాథన్‌మిట్ట ప్రాంతంలో జరిగింది. స్థానికంగా నివశిస్తున్న ఓ యువతికి కరోనా సోకింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఆ అంబులెన్సు డ్రైవర్ ఆమెను బలాత్కరించాడట. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు అంబులెన్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలప్పుజకు చెందిన ఈ డ్రైవర్‌పై పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఓ హత్య కేసుతో కూడా అతనికి సంబంధాలున్నాయని చెప్పారు.

Updated Date - 2020-09-06T20:13:41+05:30 IST