నాలుగేళ్ల బాలికకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-05-29T11:13:26+05:30 IST
దంతాలపల్లికి చెందిన నాలుగేళ్ల బాలికకు కరోనా పాజిటివ్ వచ్చిందని తహసీల్దార్ గౌరిశంకర్, ఎస్సై బానోతు వెంకన్న
దంతాలపల్లి, మే 28: దంతాలపల్లికి చెందిన నాలుగేళ్ల బాలికకు కరోనా పాజిటివ్ వచ్చిందని తహసీల్దార్ గౌరిశంకర్, ఎస్సై బానోతు వెంకన్న తెలిపారు. దంతాలపల్లిలో ప్రత్యేక వైద్య బృందం సభ్యులు అనుమానితుల వద్ద నుంచి బుధవారం రక్త నమునాను సేకరించి కోవిడ్ పరీక్ష కోసం ల్యాబ్కు పంపించామన్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల బాలికకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఈనెల 13న తల్లిదండ్రులతో కలిసి బాలిక మహారాష్ట్ర నుంచి ప్రైవేటు బస్సులో వచ్చిందని తెలిపారు. ప్రత్యేక ఆంబులెన్స్లో ఆ బాలికను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించామన్నారు.