మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-12T21:56:54+05:30 IST

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజులుగా

మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజులుగా ఆయన విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రబీ సీజన్ ముగుస్తుండడంతో రైతులను, వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పామాయిల్ తదితర పంటల పైపు రైతులు దృష్టి సారించేలా వారికి నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో నిరంజన్‌రెడ్డి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తనను కలిసిన వారందరూ కరోనా టెస్ట్లు చేసుకోవాలని ఆయన విజ్ఙప్తి చేశారు. 



తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 2,251 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ వల్ల ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,29,529కి చేరుకుంది. కరోనాతో మొత్తం 1,765 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 21,864 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 3,05,900 మంది రికవరీ అయినట్లు సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసినహెల్త్ బులిటెన్‎లో పేర్కొంది.

Updated Date - 2021-04-12T21:56:54+05:30 IST