భీమవరంలో హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-04-01T21:58:10+05:30 IST
బీమవరంలో కరోనా కలకలం రేపింది. పట్టణంలోని హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి కరోనా పాజిటివ్గా తేలింది. భీమవరం ప్రాంతంలోని ఓ మండలంలోని పీఎస్లో బాధితుడి తండ్రి పనిచేస్తున్నాడు.
ఏలూరు: బీమవరంలో కరోనా కలకలం రేపింది. పట్టణంలోని హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి కరోనా పాజిటివ్గా తేలింది. భీమవరం ప్రాంతంలోని ఓ మండలంలోని పీఎస్లో బాధితుడి తండ్రి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అప్రమత్తమైన అధికారులు హెడ్ కానిస్టేబుల్తో పాటు వారి కుటుంబ సభ్యులను ఏలూరు క్వారంటైన్కు తరలించారు. అయితే హెడ్కానిస్టేబుల్ కుమారుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో హెడ్కానిస్టేబుల్ పనిచేస్తున్న పోలీసు స్టేషన్ సిబ్బంది ఆందోళనలో ఉన్నారు.