వైసీపీ నేతకు కరోనా.. 18 గ్రామాల్లో తిరిగిన వైనం!

ABN , First Publish Date - 2020-06-05T01:47:07+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది.

వైసీపీ నేతకు కరోనా.. 18 గ్రామాల్లో తిరిగిన వైనం!

రాజమండ్రి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప కంట్రోల్ కావట్లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలో వైసీపీ నేతకు కరోనా పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.


కాగా మూడ్రోజుల క్రితం జరిగిన రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవంలో పి. గన్నవరం ఎమ్మెల్యేతో పాటు ఆ వైసీపీ నేత 18 గ్రామాల్లో తిరిగారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే తాజాగా ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. మరోవైపు.. మూడ్రోజులుగా ఆయన ఎవరెవర్ని కలిశారు..? అనేదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు అధికారులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా ఎలాంటి ఫలితాలు రాలేదు. 

Updated Date - 2020-06-05T01:47:07+05:30 IST