కరోనావేళ.. మంత్రాల మాయాజాలమేలా?

ABN , First Publish Date - 2020-08-12T10:02:53+05:30 IST

ఓపక్క కరోనా రక్కసి రోజురోజుకూ విజృంభిస్తోంది. మరోపక్క మూఢనమ్మకాల ముసుగులో తనను ఆశ్రయించిన వారికి స్వామీజీ అవతారం ఎత్తిన

కరోనావేళ.. మంత్రాల మాయాజాలమేలా?

ఎక్మాయిలో బాలప్ప దర్శనానికి జనం బారులు


బషీరాబాద్‌: ఓపక్క కరోనా రక్కసి రోజురోజుకూ విజృంభిస్తోంది. మరోపక్క మూఢనమ్మకాల ముసుగులో తనను ఆశ్రయించిన వారికి స్వామీజీ అవతారం ఎత్తిన ఓ తాత కొవిడ్‌-19 నిబంధనలకు విరుద్ధంగా మంగళవారం మొక్కుబడి చెబుతూ కనిపించాడు. ఇదంతా ఒకెత్తయితే మంత్రతంత్రాల పేరుతో నేటికీ సామాన్యులు నయవంచనకు గువుతుండటం ఆందోళన కలిగించే అంశం. బషీరాబాద్‌ మం డలం ఎక్మాయి గ్రామ శివారులో బాలప్ప (తాత)గా అవతరించి గత కొన్నేళ్లుగా మఠం ఏర్పాటు చేసుకొని ఇక్కడే స్థిరనివాసం ఉంటున్నాడు.


తాను గురుబోధ తీసుకున్నానని అంతా భగవంతుడి ఆశీర్వాదం అంటూ మఠంలో తనను ఆశ్రయించిన భక్తులు, ప్రజలకు మంత్రతంత్రాలతో మొక్కుబడి చెబుతూ తాయత్తు, మూలికా మందులు ఇస్తాడు. ప్రత్యేక దినాల్లో ఈ మఠానికి తాత దర్శనం కోసం బాణామతి, చేతబడి అంటూ స్థానికులతో పాటు, సరిహద్దు కర్ణాటక నుంచి కాలినడకన, వాహనాలపై పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో మఠం కిక్కిరిసిపోతుంది. ఏదేమైనా ప్రస్తుత తరుణంలో దర్శనం కోసం పలువురు స్వీయనియంత్రణ పాటించకుండా గుంపుగా ఆశ్ర మానికి రావడం ఆందోళన కలిగిస్తోంది. 

Updated Date - 2020-08-12T10:02:53+05:30 IST