వేద పాఠశాల విద్యార్థికి స్వల్ప అనారోగ్యం
ABN , First Publish Date - 2020-04-09T09:07:00+05:30 IST
వేద పాఠశాల విద్యార్థికి స్వల్ప అనారోగ్యం
తిరుమల, ఏప్రిల్ 8: తిరుమలోని వేదపాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. జలుబు, దగ్గు, విరేచనాలతో బుధవారం స్థానిక అశ్విని ఆస్పత్రికి వచ్చాడు. గతనెల 13న ముంబైలో జరిగిన ఓ యాగానికి వెళ్లి 15న తిరుమలకు చేరుకున్నట్టు అతను వైద్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ముందు జాగ్రత్తగా వైద్యపరీక్షల కోసం ఆ విద్యార్థితో పాటు మరో ముగ్గురిని కూడా తిరుపతి స్విమ్స్కు తరలించారు.