‘సాయం’లో భౌతిక దూరం తప్పనిసరి: సీఎస్
ABN , First Publish Date - 2020-04-09T09:06:41+05:30 IST
‘సాయం’లో భౌతిక దూరం తప్పనిసరి: సీఎస్
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వంతోపాటు దాతలు అందించే సహాయ కార్యక్రమాల వద్ద ప్రజలు గుమికూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.