కరోనాతో ఇద్దరు మాజీ క్రీడాకారుల మృతి
ABN , First Publish Date - 2020-04-09T10:08:32+05:30 IST
కరోనా మహమ్మారి ఇద్దరు మాజీ క్రీడాకారులను బలి తీసుకొంది. ఇటలీకి చెందిన మాజీ అథ్లెట్ డొనాటో సాబియా (56) కరోనా వైర్సతో పోరాడలేక బుధవారం ...
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇద్దరు మాజీ క్రీడాకారులను బలి తీసుకొంది. ఇటలీకి చెందిన మాజీ అథ్లెట్ డొనాటో సాబియా (56) కరోనా వైర్సతో పోరాడలేక బుధవారం తుదిశ్వాస విడిచాడు. సాబియా 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో 800 మీ. పరుగులో 5వ స్థానం, 1988లో సియోల్లో జరిగిన ఒలింపిక్స్ 800 మీ. పరుగులో 7వ స్థానంలో నిలిచాడు. ఇక, స్విట్జర్లాండ్కు చెందిన ఐస్ హాకీ మాజీ ఆటగాడు రోజర్ చప్పాట్ (79) కొవిడ్-19 వైరస్ సోకి మరణించాడు. స్విస్ జట్టుకు రోజర్ వందకుపైగా మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 1964 వింటర్ ఒలింపిక్స్లో రోజర్ ఆడాడు.