ఒకే ఇంట్లో 12 మంది కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-14T20:20:04+05:30 IST
ఒకే ఇంట్లో 12 మంది కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్
పశ్చిమగోదావరి: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఏలూరులో పడమర వీధిలో ఒకే ఇంట్లోని 12 మంది కుటుంబ సభ్యులకు పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. మొదట కుటుంబ యజమానికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం కుటుంబలో అందరికీ టెస్టులు చేయడంతో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తెలిసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో వృద్ధులు, చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. దీంతో చుట్టుప్రక్కల వారు భయాందోళన చెందుతున్నారు.