కార్పొరేట్‌ కొమ్ము కాస్తున్న కేంద్రం: సీపీఐ

ABN , First Publish Date - 2021-01-17T08:34:22+05:30 IST

కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థల కొమ్ము కాస్తూ రైతుల నోట్లో మట్టికొడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు.

కార్పొరేట్‌ కొమ్ము కాస్తున్న కేంద్రం: సీపీఐ

అనంతపురం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థల కొమ్ము కాస్తూ రైతుల నోట్లో మట్టికొడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. శనివారం అనంతపురంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో రైతుసంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించటం దారుణమన్నారు. సదస్సులో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, సీపీఎం రాష్ట్ర నేత ఓబులు, వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T08:34:22+05:30 IST