అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్- గుత్తా
ABN , First Publish Date - 2020-11-23T00:47:10+05:30 IST
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో ఉందని శాసన మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి అన్నారు.
దేవరకొండ: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో ఉందని శాసన మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఆదివారం ఆయన దేవరకొండ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రపంచ స్థాయి అవార్డులను గెలుచుకుందని తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని హైదరాబాద్ జంటనగరాల ప్రజలను, రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు. కేటీఆర్ తన విజన్తో హైదరాబాద్ మహా నగరాన్ని ఎంతో అభివృద్ది చేశారన్నారు. మున్సిపల్, ఐటీశాఖ మంత్రిగా ఆయన గొప్ప ప్రతిభను కనబరిచారని ప్రశంసించారు.