దేశంలో 138.96 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-22T22:20:27+05:30 IST

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

దేశంలో 138.96 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అందులో భాగంగా ఇప్పటి వరకూ 138.96 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడచిన 24గంటల్లో 57లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.40 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,317 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 78,190 కాగా గడిచిన 38 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం (0.58శాతం)గా అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-22T22:20:27+05:30 IST