ప్రైవేటు ఆన్ లైన్ క్లాసులకు అనుమతివ్వాలి: సీపీఐ
ABN , First Publish Date - 2020-07-10T09:25:48+05:30 IST
ప్రైవేటు ఆన్ లైన్ క్లాసులకు అనుమతివ్వాలి: సీపీఐ
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు లేవు. వారి జీవితాలు దుర్భరంగా మారాయి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వారికి ఒక్కొక్కరికీ నెలకు రూ.10 వేల చొప్పున 4 నెలలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలలు కూడా ఆన్ లైన్ తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రైవేటు పాఠశాల గుర్తిం పు రెన్యువల్ గడువును రెండు నెలలు పొడిగించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇస్రో ప్రైవేటీకరణ యోచనను నిరసిస్తూ గురువారం తలపెట్టిన చలో శ్రీహరికోట కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో కరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా వేసినట్లు తెలిపారు.