25న రైతు సంఘాల ధర్నాకు సీపీఐ మద్దతు: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-09-21T14:48:44+05:30 IST

కేంద్ర వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ఈ నెల 25న రైతు సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు సీపీఐ మద్దుతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.

25న రైతు సంఘాల ధర్నాకు సీపీఐ మద్దతు: రామకృష్ణ

అమరావతి: కేంద్ర వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ఈ నెల 25న రైతు సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు సీపీఐ మద్దుతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. కార్పొరేట్ శక్తులకు దాసోహం అంటూ మోడీ ప్రభుత్వం రైతాంగానికి, వ్యవసాయరంగానికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. వ్యవసాయం అంటే తెలియని విజయసాయిరెడ్డి ప్రతిపక్షాలను విమర్శించడం తగునా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లును అనైతికంగా ఆమోదింప చేసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-09-21T14:48:44+05:30 IST