సీఎం జగన్కు సీపీఐ రామకృష్ణ లేఖ
ABN , First Publish Date - 2020-03-26T15:04:40+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. అమరావతి రాజధాని ఉద్యమం నేటికి 100 రోజులు పూర్తి చేసుకుందన్న విషయం గుర్తు చేశారు.
ఇకనైనా విరమించుకోండి!
‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ అమరావతిలో మొక్కవోని దీక్షతో రైతులు, మహిళల ఆందోళన చేస్తున్నారు. వైసీపీ తప్ప ఎవరూ 3 రాజధానులను అంగీకరించడంలేదు. రాజధాని భూముల విషయంలో హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. ఇప్పటికైనా మొండిపట్టు వీడి మూడు రాజధానుల ఏర్పాటు విరమించుకోవాలి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలి’ అని లేఖలో రామకృష్ణ రాసుకొచ్చారు.