బీజేపీలో అందరూ.. బ్యాంకులకు టోపీ పెట్టేవారే!
ABN , First Publish Date - 2022-09-18T09:40:53+05:30 IST
బీజేపీలో దేశభక్తులు ఎవరూ లేరని, బ్యాంకులకు టోపీ పెట్టి ప్రజాధనం దోచేసే కొత్తపల్లి గీత లాంటి వారే ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
డాబాగార్డెన్స్(విశాఖపట్నం), సెప్టెంబరు 17: బీజేపీలో దేశభక్తులు ఎవరూ లేరని, బ్యాంకులకు టోపీ పెట్టి ప్రజాధనం దోచేసే కొత్తపల్లి గీత లాంటి వారే ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ‘వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 75వ వార్షికోత్సవ సభ’లో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం విజయం సాధించడం మూలంగానే హైదరాబాద్ సంస్థానమే గాక దేశంలోని మరో 110 సంస్థానాలు విశాల భారతదేశంలో విలీనమయ్యాయని తెలిపారు. దీనివల్ల సమగ్రత, ఐక్యతతో ప్రస్తుత భారతదేశం అవతరించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగానే భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడ్డాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నేతలు వై.వి.బి.తులసీదాస్, కె.లోకనాథం తదితరులు పాల్గొన్నారు.